అజయ్ ప్రసాద్ కథ “ఆమె నీడ” వినండి

అనేక రూపాల ప్రేమ…
జీవితాన్ని రకరకాల మలుపులు తిప్పే ప్రేమ…
ఈ ప్రేమ కథ కూడా ఒక మలుపు తిరగాలనుకుంది.
తిరిగిందా?
ఆమె నీడ కథ  చదవండి!

రచయిత బి.అజయ్ ప్రసాద్  50 ఏళ్ల కిందట బాదర్ల దశరధరామయ్య, రాఘవమ్మ దంపతులకు 1972 జూన్ 9న జన్మించారు. ఒక ప్రైవేట్ కంపెనీలో స్టెనోగ్రాఫర్ గా జీవిక కొనసాగిస్తున్నారు.

2005లో వచ్చిన తన మొదటి కథ ‘మరుభూమి’ తో రచయితగా గుర్తింపు పొందారు. ఇప్పటిదాకా 50 కి పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురించ బడ్డాయి. వాటిలో 30 కథలతో రెండు కథా సంపుటాలు ‘లోయ, గాలి పొరలు’ పేర్ల తో ముద్రించబడ్డాయి. కొన్ని కథలు హిందీ, తమిళ, కన్నడ భాషలలోకి  అనువదించబడ్డాయి.

తన సహ  రచయితల యదార్థ జీవిత వృత్తాంతాలతో తీసిన ‘ఒక వెళ్ళిపోవాలి’ ఫీచర్ ఫిల్మ్ కోసం తన పాత్రకు మాటలు రాసి అందులో నటించారు.

*

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు