పయనం ముఖ్యమా? గమ్యం ముఖ్యమా?? అంటే రెండూ ముఖ్యమే.
నలుగురం కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక గమ్యం ఉండాలి. ప్రయాణం చేయడం వెనక కారణాలు ఏవైనా కావచ్చు. ప్రయాణించడం, స్నేహితులతో కలిసి ప్రయాణించడం, హిమాలయాలంటే ఓ ఆకర్షణ, దైవ దర్శనం ,ఇంటి బాధ్యతల నుండి కాస్త వెసులుబాటు దొరికాక మనకంటూ సమయాన్ని కేటాయించుకోవడం… ఇలా ఏవైనా కావచ్చు. ఆ విధంగానే ఆరుగురం స్నేహితురాళ్ళం కలిసి మా యాత్ర ప్రారంభించాం. అందరికీ ఎంతో ఇష్టమైనది హిమాలయాల సందర్శనం. అందుకని అటువైపుగా మా యాత్ర మొదలైంది. ఆదికైలాశ్, ఓం పర్వత్ సందర్శన చేసుకురావాలని నిశ్చయించుకున్నాం. ఈ యాత్రను నిర్వహించే ఒక ట్రావెల్స్ వారిని సంప్రదించి వారి ద్వారా ఈ యాత్ర మొదలుపెట్టాం. అయితే ఆ రెండింటిని దర్శనం చేసుకునేందుకు వెళ్లి వచ్చే దారులలో మరికొన్ని ఆకట్టుకునే స్థలాలను, క్షేత్రాలను దర్శించుకున్నాం. అదే ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నవి.


Add comment