కవిత్వం లో వస్తువు ముఖ్యమా? శిల్పం ముఖ్యమా అన్న ప్రశ్నకు సమాధానం సూటిగా దొరక్కపోవచ్చు కానీ అదే మనం ఒక కవి రచనలను మదింపు చేస్తే ఆ కవి మార్గమేదో గమనించవచ్చు.సామాజిక అంశాలను ఎంచుకునేవారు వస్తు ప్రధానకవులయితే..ఎంచుకున్న అంశమేదయినా ఒక గొప్ప సౌందర్యానుభూతితో చెప్పటం ద్వారా అది అనుభూతి కవిత్వమై పాఠకుడిని ఆకట్టుకుంటుంది.ఆకాశవాణి ప్రయోక్త ఆవాల శారదగారి వర్ణాల వాన కవిత్వ సంపుటిని పరిశీలించినప్పుడు ఈ ఆలోచన అప్రయత్నంగా మెదిలింది.అసలు ఆకాశవాణిలో పనిచేసిన సృజనశీలురందరూ సౌందర్యారాధకులే.ఆచంట జానకీరాం, కృష్ణ శాస్త్రి, బుచ్చిబాబు, లత,గోపిచంద్, శ్రీకాంత శర్మ ,సుధామ,కలగ కృష్ణ మోహన్ వంటి ప్రముఖుల రచనలు ఆ సౌందర్య శోభను ప్రదర్శిస్తాయి. ఆవాల శారద కవిత్వం కూడా ఆ రకమైన సౌందర్యంతో కాంతులీనుతుంది.

కవిత్వపు వర్ణాల వాన