శివారెడ్డి కవిత్వం

ప్రతిష్టాత్మకమైన సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని పొందిన ప్రముఖ తెలుగు కవి – కె. శివారెడ్డి.. తెలుగు కవిత్వ మాతృమూర్తికి ముద్దుబిడ్డల్లో ఒకరు. సిటీలో నివసిస్తున్నా, సింప్లిసిటీయే ఆయనకు ఆభరణం. ఆగస్ట్ 1, 1967 నుంచి వివేకవర్ధని డిగ్రీ కళాశాల , హైదరాబాద్ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా కెరీర్ ప్రారంభించి, 1999లో ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు. శివారెడ్డి గారి మొదటి కవితా సంపుటి పేరు.. ‘రక్తం సూర్యుడు’. మొత్తం 16 కవితా సంపుటాలు వెలువడ్డాయి. 1990లో మోహనా! ఓ మోహనా! కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ లభించింది. వివిధ దేశాల్లో మన దేశం తరఫున పాల్గొని, తన కవిత్వాన్ని వినిపించిన శివారెడ్డి గారు, వర్ధమాన కవుల్ని ప్రోత్సహించడంలో, వారికి మార్గదర్శనం చేయడంలో.. ముందు వరసలో ఉంటారు.

మురళీధర్ కేసరి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు